ప్రతి ఒక్కరు విధిగా మొక్కలు నాటి, వాటిని కాపాడాలని, పర్యావరణాన్ని సంరక్షించాలని యంపివో కందుల వీరయ్య అన్నారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం వేపలసింగారం గ్రామ పంచాయతీలో సర్పంచ్ అన్నెం శిరీష కొండారెడ్డి అధ్యక్షతన జరిగిన 6వ విడత హరితహారం కార్యక్రమం ప్రారంభంలో ఆయన పాల్గొన్నారు. స్మశాన వాటికలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించడం అందరి బాధ్యత అని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డ్ మెంబర్స్ వరలక్ష్మి,రాంమోహన్రెడ్డి,హరిలీల, చిన్నప్ప, నర్సిరెడ్డి, పంచాయతీ జూనియర్ సెక్రటరీ శ్యామ్ ,గ్రామ పెద్దలు పల్లె నాగిరెడ్డి,రెక్కల శంభిరెడ్డి,కుందూరు కోటిరెడ్డి, కుందూరు చిన్న కోటిరెడ్డి, ఇరిగల కోటిరెడ్డి ,సారెడ్డి భాస్కర్రెడ్డి,నందిరెడ్డి సైదిరెడ్డి, సారెడ్డి భూపాల్రెడ్డి, హైదర్సాబ్, ప్రభాకర్, వెంకన్న, గ్రామ పంచాయితీ సిబ్బంది పాల్గొన్నారు.