రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ఎంతో మందిలో స్పూర్తి నింపి కొత్త ఆలోచనలకు తెరలేపుతుంది.
హీరో నవీన్ కృష్ణ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి ఈ రోజు గండిపేట లోని తన నివాసంలో మొక్కలు నాటారు ప్రముఖ హీరో సుధీర్ బాబు.
ఈ సందర్భంగా సుధీర్ బాబు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం తమలో కొత్త ఆలోచనలు తీసుకువస్తోందని అన్నారు. నూతనంగా విడుదల అయిన తన V సినిమా కు గుర్తుగా నేడు మొక్కలు నాటినట్లు తెలిపారు.
ఇకపై తన కొత్త సినిమా విడుదల కు ముందు మొక్కను నాటి ఆ మొక్కకు ఆ సినిమా పేరు పెట్టుకుంటాను అని చెప్పారు.
ఇదే విధంగా V చిత్రం బృందం ప్రముఖ నిర్మాత దిల్ రాజు, దర్శకుడు ఇంద్రగంటి మోహన్ కృష్ణ, హీరోయిన్లు నివేదిత థామస్, అదితి రావు లను మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.