రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం మహాద్భుతంగా ముందుకు కొనసాగుతోంది. హీరోయిన్ అనుపమ పరమేశ్వర్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు కేరళ లోని తన నివాస సముదాయం మూడు మొక్కలు ప్రముఖ హీరోయిన్ రాజీషా విజయన్ నాటింది.
ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో ఆమె తెలిపింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనకు మొక్కలు అంటే చాలా ఇష్టమని కానీ మా ఇంటి ప్రదేశంలో ఖాళీ స్థలం లేని కారణంగా ఇంటి బాల్కనీలో పెట్టుకున్నానని తెలిపింది. వీటిని సంరక్షించే బాధ్యత కూడా తానే తీసుకుంటానని ఆమె చెప్పింది.