35.2 C
Hyderabad
April 20, 2024 16: 12 PM
Slider నల్గొండ

పుట్టిన రోజు సందర్భంగా వంద మొక్కలు నాటిన ఎమ్మెల్యే సైదిరెడ్డి

#Green Challenge

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ  శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి తన పుట్టిన రోజును పురస్కరించుకుని హుజూర్ నగర్ పట్టణంలోని 3వ, వార్డులో మొక్కలు నాటారు. కాలుష్యాన్ని  నియంత్రణ చేసే పనిలో భాగంగా ప్రాణవాయువును మన కోసం మనమే ఏర్పాటు చేసుకోవడానికి ఈ కార్యక్రమం నిర్వహించినట్లు ఆయన తెలిపారు.

సీఎం కేసీఆర్ మానసపుత్రిక అయిన హరితహారంలో భాగంగా తన పుట్టిన రోజు సందర్భంగా మొక్కలు నాటాలని,  నాటిన ప్రతి మొక్కను కూడా బ్రతికించు కోవాలని సైది రెడ్డి  పిలుపునిచ్చారు. ఈ మేరకు సైదిరెడ్డి ఆకాంక్షని నిజం చేయాలనే ఆలోచనతో 75 వేల రూపాయల  సొంత ఖర్చులతో తయారు చేయించిన  80 ‘ఐరన్ ట్రీ గార్డ్’ లని మున్సిపల్ కమిషనర్ నాగిరెడ్డి, మున్సిపల్ చైర్మన్ గెల్లి అర్చన రవికి అందచేశారు. 

వీటిని మూడో వార్డులో ఏర్పాటు చేసే విధంగా కోరినట్లు 3వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి  తెలిపారు. ఈ కార్యక్రమంలో AE ప్రవీణ్, రాజశేఖర్, మూడో వార్డు ప్రజలు యువకులు పాల్గొన్నారు.

Related posts

జేపీసీ డిమాండ్ అర్ధ రహితం

Bhavani

యూపీఏ లేదన్న మమతాకు కాంగ్రెస్ గట్టి కౌంటర్

Sub Editor

పొలిటికల్ ఎన్ కౌంటర్ : మీలాగా బజారు భాష మాట్లాడలేను

Satyam NEWS

Leave a Comment