రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నటుడు విశ్వక్ సేన్ ఇచ్చిన ఛాలెంజ్ ను స్వీకరించి హీరో అల్లు శిరీష్ నేడు తన నివాసంలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అల్లు శిరీష్ మాట్లాడుతూ రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అని ఒక మంచి కార్యక్రమం చేపట్టారని అందులో తాను కూడా పాల్గొని తమ నివాసం లో మొక్కలు నాటామని తెలిపారు.
ఈరోజు మొక్కలు నాటడం వల్ల తనకు ఎంతో సంతోషంగా ఉందని అన్నారు. రోజురోజుకు పెరిగిపోతున్న వాతావరణ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా తన మేనల్లుడు ఆరణవ్, మరదలు అన్విత, సమరా నివ్రితి లకు మొక్కలు నాటాలని చాలెంజ్ ఇచ్చారు.