రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేడు సూరారం లోని టెక్ మహీంద్రా కళాశాల ఆవరణంలో ప్రముఖ సినిమా హీరోయిన్ (మహానటి ఫేమ్) కీర్తి సురేష్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన ఈ గ్రీన్ ఛాలెంజ్ ఎంతో మంచి కార్యక్రమమని ఈ సందర్భంగా కీర్తి సురేష్ అన్నారు. మొక్కలు నాటిన సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా నేను మొక్కలు నాటాను. నా లాగా ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని కోరుకుంటున్నాను అని అన్నారు. పొల్యూషన్ పెరుగుతున్న ఈ సమయంలో ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొని చెట్లను పెంచాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సినిమా నటుడు కాదంబరి కిరణ్, గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కో ఫౌండర్ రాఘవ, ప్రతినిధి కిషోర్ గౌడ్ పాల్గొన్నారు.
previous post