గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ యాంకర్ శివ జ్యోతి (ఇస్మార్ట్ సావిత్రి) నేడు మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యుడు జోగినిపల్లి సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మూడో సీజన్లో భాగంగా యాంకర్ బిత్తిరి సత్తి ఇచ్చిన ఛాలెంజ్ స్వీకరించి యాంకర్ శివ జ్యోతి మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ అనే మంచి కార్యక్రమం చేపట్టారని, తనకు ఈ ఛాలెంజ్ బిత్తిరి సత్తి ఇచ్చాడని, ఆయన చాలెంజ్ స్వీకరించి ఈ రోజు ఈ మొక్కను నాటే కార్యక్రమం చేపట్టానని అన్నారు.
అదేవిధంగా ఈ మొక్కలు పెంచే బాధ్యత కూడా తానే తీసుకుంటాను అని తెలిపారు. ఈ సందర్భంగా మొక్కలు నాటాలని బిగ్ బాస్ ఫేమ్ హిమజ; ఆశురెడ్డి రోహిణి లకు ఛాలెంజ్ విసిరారు.