రాజ్యసభ సభ్యుడు సంతోష్ కుమార్ ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమమంలో కరీంనగర్ మున్సిపల్ కమిషనర్ వల్లూరి క్రాంతి పాల్గొన్నారు.
ఈరోజు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా తన కార్యాలయం ఆవరణలో మూడు మొక్కలు నాటారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ కోసం, కాలుష్య నివారణ కోసం ఎంపీ సంతోష్ కుమార్ తీసుకుంటున్న చొరవ చాలా గొప్పదని అన్నారు.
కరీంనగర్ లో తెలంగాణ ప్రభుత్వం వచ్చాక చాలా అభివృద్ధి జరిగిందని, హరితహారం కార్యక్రమంలో మొక్కలు నాటి, వాటిని కాపాడే దిశగా చర్యలు తీసుకుంటున్నామని అన్నారు.