గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటి నబా నటేష్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని స్వతహాగా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు బెంగళూరు లోని తన నివాసంలో ఆమె మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పచ్చదనం పెంచడం కోసం చాలా చక్కని ఛాలెంజ్ ను చేపట్టారని దీనిని చూసి స్ఫూర్తి పొంది మొక్కలు నాటానని తెలిపారు.
ఈ చాలెంజ్ అదేవిధంగా కొనసాగాలని అందుకోసం హీరోయిన్లు అనూ ఇమాన్యుల్, నిధి అగర్వాల్, హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు.