32.2 C
Hyderabad
March 29, 2024 00: 30 AM
Slider సినిమా

మొక్కలు నాటిన హీరోయిన్ నభా నటేష్

#NabhaNatesh

గ్రీన్ ఇండియా ఛాలెంజ్ లో భాగంగా ప్రముఖ బాలీవుడ్ నటి నబా నటేష్ మొక్కలు నాటారు. రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ను స్ఫూర్తిగా తీసుకొని స్వతహాగా ఛాలెంజ్ ను స్వీకరించి నేడు బెంగళూరు లోని తన నివాసంలో ఆమె మొక్కలు నాటారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాజ్యసభ సభ్యులు జోగినిపల్లి సంతోష్ కుమార్ పచ్చదనం పెంచడం కోసం చాలా చక్కని ఛాలెంజ్ ను చేపట్టారని దీనిని చూసి  స్ఫూర్తి పొంది మొక్కలు నాటానని తెలిపారు.

ఈ చాలెంజ్ అదేవిధంగా కొనసాగాలని అందుకోసం హీరోయిన్లు  అనూ ఇమాన్యుల్, నిధి అగర్వాల్, హీరో బెల్లంకొండ  సాయి శ్రీనివాస్ లను గ్రీన్ ఇండియా ఛాలెంజ్ స్వీకరించి మొక్కలు నాటాలని ఆమె పిలుపునిచ్చారు.

Related posts

శివసేన ఎంఎల్ఏలలో చీలిక తెస్తున్న బిజెపి

Satyam NEWS

వెల్ డన్: డ్రైనేజీ కార్మికులకు ఘన సన్మానం

Satyam NEWS

న‌త్త‌న‌డ‌క‌న బాగ్ అంబ‌ర్‌పేట్ రోడ్డు నిర్మాణ ప‌నులు

Sub Editor

Leave a Comment