పవిత్ర రంజాన్ పర్వదినం సందర్భంగా రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ నియోజకవర్గ కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస్ ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ఈరోజు ఉదయం ఆయన వేములవాడ పట్టణంలోని సుభాష్ నగర్ ముస్లిం సోదరులను ఆత్మీయంగా కలుసుకొని వారికి ఈద్ ముబారక్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో సోదరభావం, సమైక్యతకు రంజాన్ పండుగ పర్వదినం ప్రతీక అని తెలిపారు. అల్లా దీవెనలతో ప్రపంచ మానవాళికి సకల శుభాలు కలగాలని, కరోనా మహమ్మారి నుంచి బయటపడి ప్రతి ఒక్కరూ ఆయురారోగ్యాలతో జీవించాలని ఆయన ఆకాంక్షించారు.
previous post