భారత రాష్ట్రపతిగా గెలుపొంది ఈనెల 25న,ప్రమాణ స్వీకారం చేయబోయే తొలి ఆదివాసి మహిళ ద్రౌపది ముర్ము కు విన్నపం ఒక పోరాటం స్వచ్ఛంద సంస్థ, పౌర స్పందన వేదిక తరపున ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా విన్నపం ఒక పోరాటం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షురాలు లీలావతి చీకూరి మాట్లాడుతూ ఒడిశా లోని ఓ మారుమూల గ్రామంలో సంతాల్ గిరిజన తెగలో జన్మించి తన జీవితంలో ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొంటూ ఒక క్లర్క్ గా తన జీవితాన్ని ప్రారంభించి కొంతకాలం ఉపాధ్యాయురాలుగా ప్రజా సేవ చేయాలనే ఆలోచనతో రాజకీయంలో అడుగుపెట్టి నేడు భారత అత్యున్నత రాష్ట్రపతి పీఠాన్ని అధిష్టించనున్న మహిళ భారతదేశ మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారని అన్నారు.
రాష్ట్రపతి బాధ్యతలు స్వీకరించిన తర్వాత రాష్ట్రపతి ప్రజాదర్బార్ ఏర్పాటు చేయాలని లీలావతి కోరారు. పౌర స్పందన వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షురాలు కందూరు అలివేలు మంగ మాట్లాడుతూ ఉపాధ్యాయురాలు నుండి రాష్ట్రపతి బాధ్యతను స్వీకరించనున్న ద్రౌపది ముర్ము ఉపాధ్యాయురాలు కావటం మా ఉపాధ్యాయులందరికీ గర్వకారణంగా ఉందని,తాను ఒక ఉపాధ్యాయురాలుగా పని చేస్తున్నానని,ఉపాధ్యాయులు అందరికీ ఆదర్శంగా నిలిచారని,విద్యను బోధించే గురువు దేశాన్ని పాలించే ప్రధమ పౌరురాలుగా ఉండటం గర్వించదగ్గ విషయమని అన్నారు. ఈ కార్యక్రమంలో స్వప్న,శ్వేత,ఆశ, శ్రావణి,పూజిత తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్ హుజూర్ నగర్