కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం లోని పిట్లమ్ మండల కేంద్రం లో 30 పడకల ఆసుపత్రి కి తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ,మార్కెటింగ్, వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీష్ రావు నేడు భూమి పూజ చేశారు. అనంతరం మార్కెట్ కమిటీ షాపింగ్ కాంప్లెక్స్ ప్రారంభోత్సవం, బిచ్కుంద మండల కేంద్రంలో డయాలిసిస్ సెంటర్ ప్రారంభోత్సవం, దోంగ్లి నూతన మండల కేంద్రము ప్రారంభోత్సవం నిర్వహించారు. పాఠశాల భవనానికి భూమి పూజ చేశారు. ఈ కార్యక్రమంలో జుక్కల్ శాసన సభ్యులు హన్మంతు షిండే, జహీరాబాద్ ఎంపీ బిబి పాటిల్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లా డీసీసీబీ చైర్మన్ పోచారం భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇంకా MLC గంగాధర్ గౌడ్, జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, జిల్లా ఎస్పీ శ్రీనివాస్ రెడ్డి, నియోజక వర్గ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు,అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.
జి.లాలయ్య, సత్యం న్యూస్, జుక్కల్ నియోజకవర్గం