ఖాళీగా ఉన్న ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను ప్రభుత్వం వేగవంతం చేసిందని మంత్రి హరీష్ రావు తెలిపారు. త్వరలో గ్రూప్-4 ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. 95% ఉద్యోగాలు స్థానికులకే దక్కేలా నిబంధనల్లో మార్పులు చేసినట్లు చెప్పారు. అగ్నిపథ్ పేరుతో కేంద్రం నిరుద్యోగులను నిండా ముంచిందని ఆరోపించారు. యువత జీవితాలను నాశనం చేసే విధంగా కేంద్రం నిర్ణయాలు ఉన్నాయని విమర్శించారు.
previous post