వియం. బంజారా పోలీస్ స్టేషన్ లో విధులు నిర్వహిస్తున్న N. వేంకటేశ్వర రావు అనే కానిస్టేబుల్ ఇటీవల మరణించారు. ఆయన కుటుంబ సభ్యులకు శాఖ పరమైన భద్రత గ్రూప్ పర్సనల్ యాక్సిడెంటల్ ఇన్సూరెన్స్ నుండి 5 లక్షల రూపాయలు చెక్కు ను ఖమ్మం పోలీసు కమిషనర్ విష్ణు యస్. వారియర్ నేడు అందజేశారు. కానిస్టేబుల్ భార్య నాగంజలి ఈ చెక్కును అందుకున్నారు. ఈ సందర్భంగా శాఖపరంగా అందవలసిన బెన్ ఫిట్స్ గురించి సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఏవో అక్తరునీసా బేగం పాల్గొన్నారు.
previous post