ఆదివారం వనపర్తి పట్టణంలో జరిగిన గ్రూపు వన్ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని వనపర్తి జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష తెలిపారు. ఆదివారం ఉదయం పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాల, జూనియర్ కళాశాల, స్కాలర్స్ కళాశాల, త్రివేణి కళాశాలలో ఉన్న పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో 4,343 మందికి గాను 3,698 మంది పరీక్షకు హాజరై 85.15% హాజరయ్యారని కలెక్టర్ తెలిపారు రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆదేశాల మేరకు పరీక్షా కేంద్రాలలో ఎలాంటి ఇబ్బందులు జరగకుండా ప్రశాంతంగా పరీక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని కలెక్టర్ తెలిపారు. పరీక్షకు రెండు గంటల ముందే అభ్యర్థులు హాజరై 100% బయోమెట్రిక్ ద్వారా పరీక్షలు రాశారని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వేణుగోపాల్ , తహశీల్దార్ రాజేందర్ గౌడ్ ఉన్నారు.
పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్