ప్రముఖ సినీ నటి లావణ్య త్రిపాఠి ఇంటిలో డైరెక్టర్ జనరల్ ఆఫ్ జీఎస్టీ ఇంటెలిజెన్స్ (డీజీజీఐ) అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. అకస్మాత్తుగా జరిగిన ఈ సంఘటనతో ఫిలిమ్ ఇండస్ట్రీ మొత్తం ఒక్క సారిగా ఉలిక్కిపడింది. లావణ్య త్రిపాఠికి చెందిన చాలా కంపెనీలు జీఎస్టీ ఎగవేసినట్లుగా ఆరోపణలు ఉన్నాయి.
దాంతో జీఎస్టీ ఇంటెలిజెన్స్ అధికారులు జూబ్లీహిల్స్లోని లావణ్య త్రిపాఠి ఇంటికి చేరుకుని తనిఖీలు నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. సినిమా షూటింగ్ రద్దు చేసుకుని లావణ్య త్రిపాఠి ఇంటికి చేరుకున్నారు.