స్వాతంత్ర్య దినోత్సవాలపై తెలంగాణ హైకోర్టు మార్గదర్శకాలు జారీ చేసింది. కోర్టుల్లో స్వాతంత్ర్యదినోత్సవ వేడుకల్లో 50 మందికి మించకూడదని హైకోర్టు తెలిపింది.
స్వాత్రంత్య దినోత్సవ వేడుకలను 20 నిమిషాల్లో పూర్తి చేయాలని కూడా సూచించింది. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించ వద్దని మాస్కులు, భౌతిక దూరం, ఇతర కరోనా నిబంధనలు పాటించాలని రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.