27.7 C
Hyderabad
April 25, 2024 07: 14 AM
Slider జాతీయం

‘మోదీ’ ఇంటి పేరుపై వ్యాఖ్యలకు రాహుల్‌ కు సమన్లు

కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీకి సూరత్‌ కోర్టు సమన్లు జారీ చేసింది. పరువునష్టం కేసులో ఈ నెల 29న కోర్టుకు హాజరు కావాలని ఆదేశించింది. 2019, ఏప్రిల్‌ 13న కర్ణాటకలో జరిగిన ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న రాహుల్‌ గాంధీ.. ‘మోదీ’ ఇంటి పేరుపై పలు వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు అప్పట్లో రాజకీయ దుమారం రేపాయి. దీంతో గుజరాత్‌ బీజేపీ ఎమ్మెల్యే పూర్ణేష్‌ మోదీ ఆయనపై పరువు నష్టం కేసు నమోదు చేశారు.

కోలార్‌ బహిరంగ సభలో ప్రధాని ఇంటి పేరు మోదీ పై రాహుల్ గాంధీ పలు వ్యాఖ్యలు చేశారు. ‘నీరవ్ మోదీ, లలిత్ మోదీ, నరేంద్ర మోదీ.. వాళ్లందరి ఇంటి పేరు మోదీనే చూశారా!.. దొంగలందరి ఇంటి పేరు సాధారణంగా ఒకటే ఎందుకు వచ్చింది.. అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీంతో మోడీ సమాజ పరువు తీసేలా ప్రవర్తించారని ఎమ్మెల్యే రాహుల్‌పై ఫిర్యాదుచేశారు. రాహుల్ గాంధీపై సెక్షన్‌లు 499, 500 కింద పరువు నష్టం దావా వేశారు.

Related posts

సీపీఎస్ ఇచ్చిన మాట తప్పారా…. పూర్తిగా మరిచారా …?

Satyam NEWS

గన్నవరం విమానాశ్రయంలో తృటిలో తప్పిన ఘోర ప్రమాదం

Satyam NEWS

ఉదయం ఏజన్సీ ఏరియాలో…సాయంత్రం జిల్లా కేంద్రంలో…!ఎవరంటే…?

Satyam NEWS

Leave a Comment