గుజరాత్లోని సూరత్లోని సార్థనా ప్రాంతంలోని నిషేధిత డ్రగ్ మెత్ తయారీకి ప్రయోగశాలను ఏర్పాటు చేసిన వ్యక్తిని గుజరాత్ పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్లోని జలోర్కు చెందిన ప్రవీణ్ బిష్ణోయ్ అనే వ్యక్తిని రూ. 5.58 లక్షల విలువైన 58 గ్రాముల మెత్తో సూరత్ పోలీసులు పట్టుకున్న కొద్ది రోజులకే ఈ అరెస్టు జరిగింది.
సార్థనాలోని రాజ్వీర్ కాంప్లెక్స్ లోని సవానీ కార్యాలయంపై పోలీసుల బృందం దాడి చేశారు. ల్యాబొరేటరీలోని గాజు బీకర్లు, స్టవ్, గ్లాస్ కనెక్టర్లు , లిక్విడ్ మిథనాల్ వంటి కొన్ని ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ తయారు చేయడం కోసం ఉపయోగించే వస్తువులను సీజ్ చేశారు.