గుజరాత్ లోని మోర్బి కేబుల్ వంతెన కూలిన ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది. ఈరోజు తెల్లవారుజాము వరకు 100 మందికి పైగా మరణించినట్లు తేలిందని గుజరాత్ సమాచార శాఖ వెల్లడించింది.
కాగా ఈ ప్రమాదం నుంచి దాదాపు 177 మందిని రక్షించారు. ప్రస్తుతం 19 మంది చికిత్స పొందుతున్నారు. ఆర్మీ, నేవీ, ఎయిర్ఫోర్స్, ఎన్ డి ఆర్ ఎఫ్, అగ్నిమాపక దళాలు గాలింపులు కొనసాగిస్తూనే ఉన్నాయి.