గుజరాత్ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ సుమారు రూ.600 కోట్ల విలువైన 120 కిలోల హెరాయిన్ స్వాధీనం చేసుకుంది. గత ఐదు నెలల కాలంలో గుజరాత్లో రూ.24,800 కోట్ల విలువైన అక్రమ డ్రగ్స్ ను స్వాధీనం చేసుకోవడం సంచలనంగా మారింది. ఈ వ్యవహారంలో కొందరిని అరెస్టు చేశారు అధికారులు.
అయితే గుజరాత్ కేంద్రంగా ఈ అక్రమ డ్రగ్స్ కార్యకలాపాలు జోరుగా కొనసాగుతున్నాయి. దుస్తుల కంపెనీ పేరుతో గంజాయిని బట్టల మధ్య ప్యాక్ చేసి తరలిస్తున్నాయి ముఠాలు. గుట్టచప్పుడు కాకుండా జరిపే ఈ అక్రమ దందాపై జరిపిన ఆపరేషన్లో యాంటీ డ్రగ్స్ స్క్వాడ్ భారీ మొత్తంలో డ్రగ్స్ ను పట్టుకోవడం కలకలం రేపుతోంది.