36 C
Hyderabad
May 13, 2025 11: 41 AM
Slider నిజామాబాద్

కైండ్ హార్ట్: గల్ఫ్ మృతుని కుటుంబానికి ఆర్థిక సహాయం

basanth reddy

కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండలం కాళోజీవాడి గ్రామానికి చెందిన పైడి జగన్ రెడ్డి 15 రోజుల క్రితం సౌదీలో గుండెపోటుతో మృతి చెందాడు. 15 రోజులు గడిచినా మృతదేహం ఇంకా స్వగ్రామానికి చేరలేదు. ఆయన కుటుంబాన్ని నేడు గల్ఫ్ వెల్ఫేర్ రాష్ట్ర అధ్యక్షుడు బసంత్ రెడ్డి, హైదరాబాద్ వాసి ఓర్ల శ్రీనివాస్ రెడ్డిలు పరామర్శించారు.

కుటుంబ పరిస్థితిని చూసి చలించిన శ్రీనివాస్ రెడ్డి జగన్ రెడ్డి దహన సంస్కారాల నిమిత్తం 10 వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. జగన్ రెడ్డి గత 9 నెలల క్రితం గొర్ల కాపరిగా సౌదీ వెళ్ళాడు. 15 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందాడని అక్కడి వారు ఫోన్ చేసి చెప్పారని కుటుంబ సభ్యులు తెలిపారు.

బసంత్ రెడ్డి మాట్లాడుతూ.. గల్ఫ్ లో మృతి చెందిన వారు మృతదేహాలు తొందరగా స్వగ్రామలకు రప్పించడంలో రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాలని కోరారు. జగన్ రెడ్డి మృతదేహన్ని త్వరగా గ్రామానికి తీసుకురావడానికి కృషి చేస్తానని చెప్పారు. శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ… జగన్ రెడ్డి కుటుంబ పరిస్థితి చూసి చలించిపోయానని అన్నారు. తనకు తోచిన విదంగా సహాయం చేయాలని వచ్చినట్లు చెప్పారు.

Related posts

కోహెడ్ పండ్ల మార్కెట్ లో పర్మినెంట్ షెడ్లు నిర్మించాలి

Satyam NEWS

కరోనా బాధిత కుటుంబాలకు సీతక్క సాయం

Satyam NEWS

షార్ట్ సర్క్యూట్ తో చిల్లర దుకాణం దగ్ధం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!