రేపటి నుంచి మూడు రోజుల పాటు జరగనున్న గుణదల మాత తిరునాళ్లుకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి.
విజయవాడ నగర మున్సిపల్ కమిషనర్ ప్రసన్న వెంకటేష్ నేడు గుణదల మేరీ మాత దేవాలయాన్ని పరిశీలించారు.
అక్కడ ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కార్పొరేషన్ సిబ్బంది, శానిటరీ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది కి పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో చర్చి ఫాదర్ లు, కార్పొరేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.