27.7 C
Hyderabad
April 25, 2024 09: 50 AM
Slider కృష్ణ

జాతీయస్థాయి పురస్కారం అందుకున్న డాక్టర్ గుండబాల మోహన్

#NandiAward

శ్రీకాకుళం పట్టణానికి చెందిన డాక్టర్ గుండబాల మోహన్ కు ఆదరణ, ఆలయం చారిటీస్ సమర్పణలో  వేదిక సీ. సీ. టీవీ సొసైటీ, ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ 24 క్రాఫ్ట్ వారి జాతీయ స్థాయి విశిష్ట నంది పురస్కారం దక్కింది.

విజయవాడ గాంధీనగర్ లోని డాక్టర్ అక్కినేని నాగేశ్వరరావు కళా ప్రాంగణంలో జరిగిన కార్యక్రమంలో ఆయన ఈ పురస్కారం అందుకున్నారు. కృష్ణాజిల్లా  ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్  కార్యదర్శి సురేష్ కుమార్ కోన, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ సాహిత్య అకాడమీ మాజీ సభ్యులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్, తిరుమల తిరుపతి దేవస్థానం సభ్యులు బెజ్జంకి అనిల్ కుమార్ ఈ అవార్డును ప్రదానం చేశారు.

డాక్టర్ గుండబాల మోహన్ గత 15 సంవత్సరాల నుంచి  వ్యాయామ విద్య వృత్తి లో ఉన్నారు. 2013 నుంచి శ్రీకాకుళం గ్రామీణ మండలం పెద్దపాడు ఉన్నత పాఠశాలలో వ్యాయామ ఉపాధ్యాయుడు గా పని చేస్తున్నారు.

ఇప్పటికే ఆయన ఆధ్వర్యంలో పలువురు విద్యార్థినీ, విద్యార్థులు జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి, జాతీయ స్థాయి, కుస్తీ పోటీలో నూ, వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో పాల్గొని పలు విజయాలు సాధించారు. ప్రపంచ మల్లయోధుడు, కలియుగ భీముడు, కీర్తిశేషులు కోడి రామ్మూర్తి శ్రీకాకుళం జిల్లా యువజన సంక్షేమ సంఘం అధ్యక్షులు కూడా ఆయన పని చేస్తున్నారు.

పేద విద్యార్థులలోని క్రీడా ప్రతిభను వెలికి తీసి ఆయన తన సొంత ఖర్చులతో రాష్ట్రస్థాయి జాతీయస్థాయి పోటీలకు పంపిస్తుంటారు.

Related posts

సైకోలా వ్యవహరిస్తున్న వై ఎస్ జగన్ మోహన్ రెడ్డి

Satyam NEWS

ఆదిపురుష్ పై సీఎం ఆగ్రహం

Bhavani

అధైర్య పడవద్దు అండగా నేనున్నాను

Satyam NEWS

Leave a Comment