గుంటూరు జిల్లా లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది.ఫిరంగిపురం మండలంలోని రేపూడి ఇంజనీరింగ్ కాలేజ్ దగ్గర సోమవారం ఉదయం ఆటోను మినీ లారీ ఢీకొంది. ప్రమాదంలో ఐదుగురు మృతి చెందగా, మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. లారీ – ఆటో ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదం సమాచారం అందుకున్న పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను నరసరావుపేట ఏరియా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు
previous post