తిరుపతి లోక్సభ స్థానం ఉప ఎన్నికలకు పరిశీలకులుగా గుంటూరు జిల్లాలోని పలువురు వైసీపీ నేతలకు ఆ పార్టీ అధిష్ఠానం బాధ్యతలు అప్పగించింది.
ఎమ్మెల్యేలు మేరుగ నాగార్జునకు తడ, అన్నాబత్తుని శివకుమార్కు సూళ్ళూరుపేట, కాసు మహేష్రెడ్డికి దొరవారి సత్రం, డాక్టర్ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి ఓజిలి, కిలారి రోశయ్యనాయుడుపేట అర్బన్, మద్దాళి గిరిధర్కు సూళ్లూరుపేట అర్బన్, నంబూరు శంకరరావుకు పెళ్ళకూరు, గుంటూరు మేయర్ కావటి మనోహర్నాయుడుకు నాయుడుపేట ప్రాంతాలకు ఎన్నికల పరిశీలకులుగా నియమిస్తూ అధిష్ఠానం ఉత్తర్వులు జారీచేసింది.
ఎన్నికలు సమీపిస్తుండటంతో ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు ఆయా ప్రాంతాలకు వెళ్ళి ప్రచారాల్లో పాల్గొనా లని అధిష్ఠానం ఆదేశించింది.