నిన్న నల్గొండ జిల్లా చిట్యాల పోలీసులు నేను మూర్ఖుడిని బోర్డు పెట్టి లాక్ డౌన్ నిబంధనలు ఉల్లంఘించే వారిని అక్కడే నిలబెట్టి సెల్ఫీ తీయించి వారి వాట్సప్ ఖాతాలోనే పోస్టు చేయించినట్లు నేడు గుంటూరు రూరల్ పోలీస్ లు కూడా చేశారు. నిన్న సత్యం న్యూస్ చిట్యాల పోలీసుల పోస్టు పెట్టిన విషయం తెలిసిందే. గుంటూరు రూరల్ పోలీస్ లు నేడు అదే తరహా బోర్డు పెట్టి సెల్ఫీలు తీయిస్తున్నారు.
కరోనా వైరస్ వ్యాపిస్తున్న సందర్భంగా లాక్ డౌన్ నిబంధనలు పాటించకుండా రోడ్ల పైకి వచ్చే వారికి ఈ విధంగా వినూత్న శిక్ష వేస్తున్నారు. నేను మూర్ఖుడిని. నేను మాస్క్ పెట్టుకొను. పని పాట లేకుండా రోడ్ల మీద తిరిగి కరోనా వైరస్ వ్యాప్తి చేస్తాను. ప్రజల ప్రాణాలతో ఆడుకుంటాను. నేను సమాజానికి శత్రువును అని ఆ బోర్డు పై రాసి సెల్ఫీ తీయించి వారితోనే అప్ లోడ్ చేయిస్తున్నారు.