మహాకవి గురజాడ అప్పారావు సేవలు గుర్తించి ఆయన పేరుతో అవార్డును ప్రకటించాలని సీపీఐ విజయనగరం జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ డిమాండ్ చేసారు. నగరంలో ని ట్యాంక్ బండ్ వద్ద విశాలాంద్ర బుక్ హౌస్ లో ఉమ్మడి జిల్లాల ఇన్ఛార్జ్ సయ్యద్ ఇబ్రహీం ఆధ్వర్యంలో గురజాడ అప్పారావు 160వ జయంతిని నిర్వహించారు.
ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి బుగత అశోక్ హాజరై గురజాడ అప్పారావు గారి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ “ఈసురోమని దేశముంటే, ప్రజలేమె బాగుపడనోయ్” “తిండి కలిగితే కండకలదోయ్, కండకలిగినోడో మనషోయ్” అని చెప్పిన గురజాడ అప్పారావు ప్రజలను సామాజిక చైతన్యం కలిగించే విధంగా రచనలు ఉండేవని అన్నారు, దేశంలోనే ప్రపంచీకరణ ఆర్ధిక విధానాలు అమలు అయిన తర్వాత దేశంలో ప్రజలు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అందుబాటులోకి లేకపోవడంతో, గురజాడ అప్పారావు ఆనాడు ఏదైతే చెప్పారో ఆ విధంగా దేశంలో పరిస్థితులు కనబడుతున్నాయి అన్నారు,
కేంద్రంలో నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వరంగ సంస్థలను కార్పోరేట్ లకు తెగనమ్మడంతో ఆర్థికంగా దేశం దివాళా తీస్తున్నదని ఆన్నారు, రాష్ట్రంలో సీఎం జగన్ వచ్చిన తర్వాత ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా వున్న పోస్టులను తీయకుండా, యువతకు ఉపాధి ఉద్యోగ అవకాశాలు లేకుండా యువతను నిర్వీర్యం చేసేందుకు కంకణంకట్టుకున్నారన్నారు,
దేశంలో అనేక మంది పేరుతో అవార్డులు ఇస్తున్నారని,, కన్యాశుల్కం, కవితలసంపుటలు,కధానికలు లాంటి సామాజిక స్పృహ కల్పించే రచనలు చేయడమే కాకుండా దళితోద్దరణ ఉద్యమాలు నడిపి, చైతన్యం కలిగించే విధంగా సామాజిక సేవలు చేసారని, తదునుగునంగా మహా కవి గురజాడ అప్పారావు పేరుతో అవార్డును ప్రకటించి,ప్రతీ సంవత్సరం సామాజిక కార్యకర్తలకు,కవులకు అవార్డు అందజేయాలని డిమాండ్ చేసారు, ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్,రంగరాజు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి టీ. జీవన్న, సమితి సభ్యులు పురం అప్పారావు తదితరులు పాల్గొన్నారు.