మహాకవి గురజాడ అప్పారావు పేరిట ఇస్తున్న “గురజాడ అప్పారావు అవార్డు’’ కులాన్ని, ఆ భావాలను ప్రవచనాలు చెప్పే చాగంటి కోటేశ్వరరావు కు ఇవ్వడం సాహితీ రంగానికే అవమానమని విజయనగరం లో అభ్యుదయ రచయతల సంఘం అభిప్రాయపడింది. ఈ మేరకు గురజాడ స్వగృహం నుంచీ గురజాడ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. అలాగే గంటస్థంభం నుంచీ గురజాడ విగ్రహం వరకు ఆ ర్యాలీ కొనసాగింది.
ఈ సందర్భంగా అరసం సభ్యులు మాట్లాడుతూ ఆయన జాడ నాకు అడుగు జాడ అంటూ తెలుగు ఆధునిక సాహిత్యం లో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న శ్రీ శ్రీ నే మహాకవి గురజాడ ను ఆదర్శంగా తీసుకుని ఓ విప్లవాన్ని తీసుకువచ్చారన్నారు. అలాంటి వ్యక్తులకు కాకుండా ప్రవచనాలలో కులాన్ని ప్రొత్సహిస్తున్న ఆ ప్రవచన కర్త కు గురజాడ అవార్డు ఇవ్వడం సహేతుకం కాదని అభ్యుదయ రచయతల సంఘం అభిప్రాయపడింది