ఈ నెల 30వ తేదీన ఆధ్యాత్మిక ప్రవచన కర్త..బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారికి “గురజాడ’ పురస్కారం అందజేస్తున్నట్టు విజయనగరం గురజాడ సాహితీ సమాఖ్య పేర్కొంది. ఈ విషయాన్ని గురజాడ స్వగృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సమాఖ్య సభ్యులు కాపుగంటి ప్రకాష్, బుచ్చిబాబు, గోపాలరావు లు చెప్పారు. అదే రోజు గురజాడ స్వగృహంలో ఉదయం నుంచీ సాయంత్రం వరకు కార్యక్రమాలు ఉంటాయి కాపుగంటి ప్రకాష్ తెలిపారు.
సమాఖ్య తరుపున రెండు దశాబ్దాల నుంచీ ఎందరో ప్రముఖులను సత్కరించామని…అలాగే గురజాడ పురస్కారం ఇచ్చామని తెలిపారు.గడచిన 22 ఏళ్ల నుంచీ గురజాడ సాహితీ సమాఖ్య పేరు తో కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని ఈ సందర్భంగా నిర్వాహకులు తెలియజేసారు.