28.7 C
Hyderabad
April 20, 2024 04: 32 AM
Slider విజయనగరం

“చాందస వాదుల గుండెల్లో గురజాడ ఒక బాంబు”

చాందస వాదుల గుండెల్లో గురజాడ అప్పారావు ఒక బాంబులా ఉంటారని ఎస్.సి. సంక్షేమ అసెంబ్లీ కమిటీ చైర్మన్ గొల్ల బాబూరావు అన్నారు. విజయనగరం జిల్లాలో రెండో రోజు పర్యటన లో భాగంగా గురజాడ వర్ధంతి సందర్భంగా నగరంలో గురజాడ అప్పారావు స్వగృహాన్ని అసెంబ్లీ కమిటీ చైర్మన్ తో సహా సభ్యులైన ఎమ్మెల్యే అలజంగి జోగారావు ఇతర సభ్యులు సందర్శించిన అనంతరం సత్య లాడ్జి వద్ద ఉన్న గురజాడ విగ్రహాన్ని సందర్శించి..పూలదండ వేసి శ్రధ్ధాంజలి ఘటించారు. అనంతరం మీడియా తో మాట్లాడుతూ… రాజ్యాంగాన్ని అంబేద్కర్ రాస్తే…. ఆధునిక సాహిత్యాన్ని అవపోసిన ఘనుడు గురజాడ అప్పారావు అని చైర్మన్ అన్నారు.ప్రస్తుత చాందస వాదు లలో గురజాడ అప్పారావు ఎల్లప్పుడూ ఒక బాంబే అని అన్నారు.మహాకవి గురజాడ అప్పారావు వర్ధంతి సందర్భంగా గురజాడ స్వగృహాన్ని సందర్శించి గురజాడ కు ఘన నివాళులు అర్పించారు.. అసెంబ్లీ కమిటీ ఛైర్మన్ గొల్ల బాబూరావు, సభ్యులు అలజంగి జోగారావు దితరులు.గురజాడ జీవిత విశేషాలు, ఆయన వినియోగించిన వస్తువులను కమిటీ సభ్యులకు చూపిన గురజాడ కుటుంబ సభ్యులు ఇందిరలు అలాగే గురజాడ సమాఖ్య ప్రతినిధులు డా. గోపాల రావులు పాల్గొన్నారు

Related posts

కేటీఆర్‌ ట్వీట్:ప్రపంచస్థాయి ఆటగాడికి నా కన్నీటి వీడ్కోలు

Satyam NEWS

మృతవీర సైనికులకు జోహార్లు

Satyam NEWS

ములుగు జిల్లా జడ్పీ చైర్మన్ కుసుమ జగదీష్ మృతి

Bhavani

Leave a Comment