38.2 C
Hyderabad
April 25, 2024 13: 39 PM
Slider ఆధ్యాత్మికం

హుజూర్ నగర్ లో ఘనంగా గురుపౌర్ణమి వేడుకలు

#Guru Poornima at Hujurnagar

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరములో గురుపౌర్ణమి సందర్భంగా ఆదివారం నాడు ఘనంగా ఉత్సవం నిర్వహించారు. ఉదయం బాబా వారి మూలమూర్తికి రెంటాల సతీష్ శర్మ ఆధ్వర్యంలో వేదమూర్తులు వేద మంత్రోచ్ఛారణలతో పంచామృతాలతో, అభిషేకం నిర్వహించారు.

అనంతరం బాబా వారిని పట్టువస్త్రాలతో,రజిత ఆభరణాలతో సుందరంగా అలంకరించి సహస్రనామార్చన, హారతులు ఇచ్చారు. స్థానిక శ్రీ అన్నమయ్య భజన మండలి వారిచే సాయి నామ సంకీర్తనార్చన కార్యక్రమం అత్యంత భక్తిశ్రద్ధలతో, భక్తుల  సాయి నామస్మరణతో షిరిడి సాయి మందిరం మారుమ్రోగింది.

అన్నమాచార్య భజన మండలి ఆలపించిన భక్తిగీతాలు భక్తులను విశేషంగా ఆకర్షించాయి. శ్రీసాయి సమాజం కమిటీ సభ్యులు భక్తులకు శానిటేషన్ అందిస్తూ  క్రమపద్ధతిలో భౌతిక దూరాన్ని పాటింప చేస్తూ, దర్శనానికి వచ్చిన భక్తులకు మాస్కులు అందజేస్తూ క్రమ పద్ధతిలో దర్శనం కల్పించారు.

ఈ కార్యక్రమంలో  శ్రీ షిరిడి సాయిబాబా సమాజం కమిటీ జనరల్ సెక్రటరీ ఓరుగంటి నాగేశ్వరరావు ,ట్రెజరర్ తొడుపునూరి శేఖర్, బాచిమంచి వెంకటేశ్వర్లు (కొండయ్య), బిక్షం, మరలా శ్రీనివాస యాదవ్, దామోదరాచార్యులు, అనంతలక్ష్మి, ఆకులరాము మరియు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని బాబా వారిని దర్శించుకున్నారు.

Related posts

మాజీ ప్రధాని ఇందిరాగాంధీ విగ్రహం ధ్వసం

Satyam NEWS

హెల్మెట్ పెట్టుకోండి..ప్రాణాలు కాపాడుకోండి..అంటున్న ట్రాఫిక్ పోలీసులు

Satyam NEWS

రూ.100 కోట్ల వెంకన్న ఆదాయానికి గండి

Satyam NEWS

Leave a Comment