28.7 C
Hyderabad
April 20, 2024 10: 01 AM
Slider ముఖ్యంశాలు

శానిటైజర్ తాగి గురుకుల విద్యార్థిని ఆత్మహత్యయత్నం

#sucideAttempt

శానిటైజర్ తాగి గురుకుల విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన ఘటన అమ్రాబాద్ మండలం మన్ననూర్ గ్రామంలో మంగళవారం చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే అచ్చంపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన బాబు దంపతులకు ఒక్కగానొక్క కూతురు శిరీష(16) మన్ననూర్ రెసిడెన్షియల్ స్కూల్ లో పదవ తరగతి చదువుతుంది. గత నెల 28 న హాస్టల్ కు వచ్చిన శిరీష మంగళవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో తన వద్ద ఉన్న షానిటైజర్ (90ఎం.ఎల్) లో 70 ఎం.ఎల్ త్రాగింది.

 గమనించిన విద్యార్థులు టీచర్లకు చెప్పడంతో ప్రిన్సిపల్ లలిత 108 కు ఫోన్ చేసి అచ్చంపేట ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. ప్రస్తుతం బాలిక ప్రాణాపాయ స్థితి నుండి కోలుకుంది.

అనంతరం మీడియాతో ప్రిన్సిపల్ లలిత మాట్లాడుతూ తల్లిదండ్రులు కొట్లాడడం, బాలికకు వివాహం చేయాలని ప్రయత్నించినట్లు బాలిక తెలిపిందని ఆమె పేర్కొన్నారు.

ఈ ఘటనపై తండ్రి బాబును వివరణ కోరగా తమకు ఒక్కతే కూతురని తాను అల్లారుముద్దుగా పెంచుకుంటున్నామని ఆమెకు వివాహం చేయాల్సిన అవసరం మాకు లేధని ప్రిన్సిపల్ దురుద్దేశంగానే తమపై ఆరోపణలు చేస్తున్నారని తెలిపారు. 

ఈ ఘటనపై ఇరువురు పొంతనలేని సమాధానం చెబుతున్నారు. బాలిక చెప్పిన ప్రకారం తనకు వివాహ ప్రయత్నాలు చేస్తున్నారని వ్యక్తం చేసింది.

Related posts

హోప్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

రోజా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా క్యాన్సర్ వ్యాధిగ్రస్తుడికి ఆర్థిక సాయం

Bhavani

బీడీ కార్మికులకు వెంటనే డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు ఇవ్వాలి

Satyam NEWS

Leave a Comment