27.7 C
Hyderabad
April 25, 2024 07: 40 AM
Slider జాతీయం

అన్నీ మేమే చేస్తామంటే పరిస్థితి ఇలాగే ఉంటుంది

#GVL Narasimharao

రాజ్యాంగ బద్దంగా ఉన్న సంస్థల పని కూడా తామే చేస్తామని ఎవరైనా అనుకుంటే అది పొరబాటేనని బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయని ఆయన అన్నారు. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గమనించి మసలు కోవాలని జీవీఎల్ నరసింహారావు హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలే ఉంటాయని, అన్నీ తామై వ్యవహరించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అన్నారు.

Related posts

అర్హులకు ప్రభుత్వ పథకాలు అందాలి

Bhavani

నిన్నెవరు చంపారో నువ్వే వచ్చి చెప్పు వివేకా

Satyam NEWS

25న సీఎం జగన్ బెయిల్ రద్దు: బిజెపి నేత కామెంట్ తో సంచలనం

Satyam NEWS

Leave a Comment