రాజ్యాంగ బద్దంగా ఉన్న సంస్థల పని కూడా తామే చేస్తామని ఎవరైనా అనుకుంటే అది పొరబాటేనని బిజెపి అధికార ప్రతినిధి జీవీఎల్ నరసింహారావు అన్నారు. ఏపీ ఎన్నికల సంఘం కమిషనర్ గా నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కొనసాగించాలంటూ హైకోర్టు తీర్పు ఇచ్చిన నేపథ్యంలో బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటే ఇలాంటి ఎదురుదెబ్బలే తగులుతాయని ఆయన అన్నారు. ఈ విషయాన్ని వైసీపీ ప్రభుత్వం గమనించి మసలు కోవాలని జీవీఎల్ నరసింహారావు హితవు పలికారు. రాజ్యాంగ వ్యవస్థలో ప్రభుత్వాలకు పరిమితమైన అధికారాలే ఉంటాయని, అన్నీ తామై వ్యవహరించాలనుకుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయని అన్నారు.