32.2 C
Hyderabad
April 20, 2024 21: 57 PM
Slider పశ్చిమగోదావరి

దేవుల‌ప‌ల్లిలో ఘ‌‌నంగా గ్యార్మి వేడుక‌లు

ursu1

పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవులపల్లి గ్రామంలో ఉన్నహజరత్ మహమ్మద్ ఖాసిం షరీఫ్ దర్గా నందు గ్యార్మి జెండా పండుగా ఘనంగా నిర్వహించారు. ముందుగా జెండాలను ఊరిలో ఊరేగించి అనంతరం హజరత్(పేషిమంమ్) మహమ్మద్ యూసుఫ్ దర్గా వద్ద ప్రత్యేక దువా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్నజంగారెడ్డిగూడెం జ‌డ్పీటీసీ పొల్నాటి బాబ్జి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలో 1916 సంవత్సరం స్థాపితమైన ఖాసిం షరీఫ్ దర్గా గ్యార్మీ ఈ పండుగను నాటి నుంచి నేటి వరకు ముస్లిం మరియు హిందూ సోదరులు సంయుక్తంగా కలిసి చేసుకోవడం చాలా ఆనందంగా ఉందని, గ్రామంలో ఎటువంటి సహాయం కావాలన్నాగ్రామ పెద్దలు, వైసీపీ ప్రభుత్వం మీకు అండగా ఉంటామ‌ని, ఇలానే ప్రతి గ్రామంలో హిందూ, ముస్లిం భాయ్ భాయ్ గా మెలగాలని కోరుకుంటున్నాను అని అన్నారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్ర‌ప్రదేశ్ రాష్ట్ర షేక్ కార్పొరేషన్ డైరెక్టర్ షేక్ అక్బర్, వైసిపి నాయకులు దోరేపల్లి లక్ష్మీనారాయణ, దోరేపల్లి సత్యనారాయణ, బుడేకుల పాపారావు, ఈవో పగడం నాగేశ్వరరావు, గ్రామంలో ముస్లిం, హిందూ సోదరులు సోదరీమణులు భారీగా పాల్గొన్నారు.

Related posts

విజయనగరం లో రహదారి భద్రతా ఉత్సవాలు

Satyam NEWS

పకడ్బందీగా ఎస్ఐ రాత పరీక్ష ప్రారంభం…!

Satyam NEWS

అడ్డంకులు ఎదురైనా అధిగమించి ముందు సాగాలి

Bhavani

Leave a Comment