ముంబయి పేలుళ్ల మాస్టర్ మైండ్, అంతర్జాతీయ ఉగ్రవాది హఫీజ్ మొహ్మద్ సయ్యీద్ మరో మారు భారత్ ను తీవ్రంగా హెచ్చరించారు.
పాకిస్తాన్ తో ఇదే విధంగా ప్రవర్తిస్తుంటే భారత్ పైకి అణ్వాయుధాలు కలిగిన డ్రోన్లను పంపుతామని ఆయన అన్నారు.
అమెరికా యుద్ధ విమానాలను భారత్ భూభాగం ఉపయోగించుకునేందుకు వీలుకల్పిస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కొవాల్సి ఉంటుందని కూడా ఆయన హెచ్చరించారు.
జమాత్ ఉద్దవా కు చెందిన హఫీజ్ మొహ్మద్ సయ్యీద్ ఈ విధంగా భారత్ ను హెచ్చరించడం ఇది కొత్త కాకపోయినా న్యూక్లియర్ ఆయుధాలను వినియోగిస్తామని తీవ్రంగా హెచ్చరించడం మాత్రం ఇదే మొదటి సారి.
భారత్ భూ భాగం నుంచి డ్రోన్లను ప్రయోగిస్తే భారత్ మొత్తం పంపడానికి తమ వద్ద డ్రోన్లు ఉన్నాయని ఆయన అన్నారు.
2008లో ముంబయిలో దాడులకు పాల్పడి 166 మందిని చంపిన కిరాతకుడు ఈ హఫీజ్ మొహ్మద్ సయ్యీద్.