ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గత ఎనిమిది సంవత్సరాల నుంచి సమగ్ర శిక్ష విభాగంలో ప్రభుత్వ పాఠశాలలో తాత్కాలిక పద్ధతిలో ఆర్ట్ , క్రాఫ్ట్ ,వ్యాయామ విద్య బోధకులు పని చేస్తున్నారు. అయితే వీరికి నాలుగు సంవత్సరాల నుంచి 14, 203 రూపాయలు గౌరవ వేతనం ఇస్తున్నారు.
ప్రస్తుత ఆర్ధిక పరిస్థితులను చూస్తే వీరికి కనీసం 23, 000 ఇవ్వాలి. అయితే వీరికి పేరుకు పార్ట్ టైం ఉద్యోగం కాగా, పనిచేస్తుంది ఫుల్ టైం, జీతాలు మాత్రం పార్ట్ టైం చెల్లిస్తున్నారు. వీరు చేసే ఉద్యోగాలకు తోడు బడి మానేసిన విద్యార్థుల సమాచారం సేకరించి తిరిగి వారిని బరిలో చేర్పించే పని కూడా చేస్తున్నారు.
అదే విధంగా గత నాలుగు నెలల నుంచి నాడు నేడు కార్యక్రమం లో భాగంగా ప్రభుత్వ పాఠశాలను ఆధునికరించే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఈ కార్యక్రమంలో కూడా పార్ట్ టైమ్ బోధకులు రోజు పాఠశాలకు ఉదయం, మధ్యాహ్నం హాజరై పనులు చేస్తున్నారు. ఉద్యోగం వచ్చేసరికి పార్ట్ టైమ్ అని చెప్పి వెట్టిచాకిరి చేయించుకుంటున్నారు.
మరో విషయం ఏమిటంటే ప్రతీ ఏడాది జీవితం ఎంతో కొంత శాతం పెంచుతామని అధికారులు చెబుతున్నప్పటికీ నేటికి ఒక రూపాయి పెరగక పోవడం విశేషం.