తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కెటిఆర్ ఆదేశాల మేరకు చేనేత కార్మికులకు అండగా ఉండి వారిని ఆదుకుందామని జుక్కల్ శాసనసభ్యులు హన్మంత్షిండే తనయుడు యువ నాయకులు హరీష్ షిండే అన్నారు .ఈ సందర్భంగా బిచ్కుంద మండల కేంద్రంలో నియోజకవర్గ యువజన విభాగం ఆధ్వర్యంలో చేనేత కార్మికులు తయారు చేసిన తెల్లటి కండువాలను పంపిణీ చేశారు .ప్రతి ఒక్కరూ చేనేత వస్త్రాన్ని ధరించి కార్మికులకు భరోసా కల్పిస్తామని ఆయన పిలుపునిచ్చారు.
కార్యక్రమంలో ఆయనతో పాటు నియోజక నియోజకవర్గ యువజన విభాగం బిచ్కుంద అధ్యక్షులు గణేష్ గొండ ,జూకల్ అధ్యక్షులు శివకుమార్ గౌడ్ ,పిట్ల౦ అధ్యక్షులు తుకారాం గౌడ్, నిజాంసాగర్ అధ్యక్షులు నాగేంద్ర ,మద్నూర్ అధ్యక్షులు ప్రదీప్ పటేల్ ,బిచ్కుంద యూత్ నాయకులు ముజ్జు, మోహిన్ ,పార్టీ టౌన్ అధ్యక్షులు బొమ్మల లక్ష్మణ్ ,సాహెబ్ రావు, పాకలి శ్రీనివాస్ ,భాను గౌడ్, నియోజకవర్గంలోని ఆయా మండలాల యువజన విభాగం నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .