పశ్చిమగోదావరిలో ఉన్న ద్వారకా తిరుమల (చిన్న తిరుపతి) లో హనుమత్ జయంతి శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ద్వారకా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి దేవస్థానం ఉప దేవాలయమైన శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయం నందు హనుమాన్ జయంతి ఉత్సవాల్లో భాగంగా నేటి (4.06.2021)ఉదయం ఆలయంలో కోవిడ్ నిబంధనలు పాటిస్తూ స్వామి వారి మూల విరాట్ కు ప్రత్యేక అలంకరణ చేసి పూజలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఈవో జి వి సుబ్బారెడ్డి, అర్చకులు, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు.