నిర్మల్ జిల్లా బోథ్ పట్టణ హనుమాన్ యూత్ సభ్యులు, మాసం లక్ష్మీ వెల్పేర్ సోసైటి సభ్యులు శివరాత్రి పండుగ రోజున తమ మానవత్వం చాటుకున్నారు.
బోథ్ గ్రామానికి చెందిన లోస్రం లక్ష్మణ్ మతిస్థిమితం లేకుండా వాడలో తిరుగుతున్నాడు. గత వారం నుండి ఒంటి పై సరిగ్గా బట్టలు లేకుండా తిరుగుతున్న అతడిని చూసి కాలనీ వాసులు భయపడుతున్నారు.
ఈ విషయాన్ని తెలుసుకున్న యువజన సంఘ, సోసైటి సభ్యులు లక్ష్మణ్ కు కొత్త బట్టలు వేసి తలనీలాలు, షేవింగ్ చేయించి తమ మానవత్వం చూపించారు. వీరు చేసిన సేవలకు స్థానికులు, కాలనీ వాసులు ప్రశంసించారు.
ఈ కార్యక్రమములో హోంగార్డ్ బూస లక్ష్మణ్, హనుమాన్ యూత్ యువజన అధ్యక్షుడు గట్ల బాలు, మాసం లక్ష్మీ వెల్ఫేర్ సోసైటి అధ్యక్షుడు అనిల్ మాసం, యువజన సంఘ సభ్యులు మంగళి దామోదర్,లోస్రం రాజశేఖర్, రాజశేఖర్, లంక రాజేష్, చాట్ల రాకేష్, మిట్టు, సోహెల్, సుకుమార్ రావుల, సంఘ సభ్యులు పాల్గొన్నారు.