27.7 C
Hyderabad
April 25, 2024 07: 37 AM
Slider గుంటూరు

హ్యాపీ ఎండింగ్: కలకలం రేపిన బాలికల అదృశ్యం

missing girls

గుంటూరు జిల్లా నరసరావుపేటకు చెందిన ఇద్దరు అమ్మాయిలు కనిపించకుండా పోవడం సంచలనం సృష్టించింది. ఈ ఇద్దరు ఎక్కడకు వెళ్లారు? ఎవరైనా కిడ్నాప్ చేశారా అనే అనుమానంతో పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించాగా వారు నేటి ఉదయం విజయవాడలో ప్రత్యక్షం అయ్యారు. దాంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. నరసరావుపేట శివారులోని రావిపాడు సెంట్ మేరీస్ స్కూల్ లో పదో తరగతి చదువుతున్న వేల్పుల పూజిత,  సైయ్యద్ షబీనా అనే ఈ ఇద్దరు బాలికలు నిన్న సాయంత్రం స్కూల్ వదిలిపెట్టిన తరువాత నుంచి కనిపించకుండా పోయారు.

బాలికల తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు రూరల్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేసుకున్నారు. పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేపట్టి అన్ని అంశాలనూ పరిశీలించారు. చివరకు వారు విజయవాడలో దొరికారు. దాంతో కేసు దర్యాప్తు చేస్తున్న పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు.

Related posts

బ్రాహ్మణులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన మంత్రి

Satyam NEWS

బాపురే….స్పంద‌న‌కు వ‌చ్చిన ఫిర్యాదులు ఎన్నో తెలుసా..?

Satyam NEWS

సమస్యల పరిష్కారానికి సమన్వయంతో పనిచేయాలి

Bhavani

Leave a Comment