ప్రజాసంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తోందని ఈ విషయంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎంతగానో శ్రమిస్తూ కృతనిశ్చయంతో ఉన్నారని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి టి.హరీష్రావు అన్నారు.
శనివారం సిద్దిపేట జిల్లా చేగుంట మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డితో కలిసి చేగుంట, నార్సింగి మండలాలకు చెందిన అర్హులైన 112 మంది లబ్ధిదారులకు కళ్యాణలక్ష్మీ, షాదీముబారక్ చెక్కులను అందచేశారు.
ఈ సందర్భంగా మంత్రి హరీష్రావు మాట్లాడుతూ పేద ప్రజలు, రైతుల సంక్షేమమే తమ ప్రభుత్వం ధ్యేయంగా పని చేస్తూ ఎల్లప్పుడూ వారి సంక్షేమం కోసం శ్రమిస్తోందన్నారు.
ఈ విషయంలో సీఎం కేసీఆర్ ప్రజోపయోగ్యమైన మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని వివరించారు.
ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయాలంటే వారి తల్లిదండ్రులు పడే ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ ద్వారా ఆడపిల్లలకు రూ.1,00,116 అందిస్తున్నారని అన్నారు.
ఆడకూతుళ్ళ పెళ్ళిళ్ళు చేయడం ఎంత కష్టమో తమకు తెలుసునని అందుకే కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ చెక్కులను పెళ్ళికూతురు తల్లిపేరుపై అందిస్తామని మంత్రి హరీష్రావు వివరించారు.
ఈ కార్యక్రమంలో చేగుంట, నార్సింగి శ్రీనివాస్, జడ్పీటీసీ కృష్ణారెడ్డి, తహశీల్దార్ విజయలక్ష్మి, నాయకులు, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.