28.7 C
Hyderabad
April 20, 2024 10: 48 AM
Slider నల్గొండ

హరితహారం కార్యక్రమం విజయవంతం చేయాలి

#Hujurnagar MRO

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులను హరితహారం లక్ష్యాలను సాధించాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పద్మావతి కోరారు.

అనంతరం మండల పరిషత్ అధికారి మాట్లాడుతూ ఈ సంవత్సరం అన్ని శాఖలకు హరితహారం లక్ష్యాలను కేటాయించారని, వాటిని సాధించాలని, నాటిన ప్రతి మొక్కను కాపాడాలని, ఆ బాధ్యత గ్రామ సర్పంచులు సిబ్బందిపై ఉందని అన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేశామని, 1,32000 మొక్కలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శులు, ఏపీవో రాజు, సాంకేతిక సహాయకులు, గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణాలో దంచి కొడుతున్న వర్షం

Bhavani

పార్టీ ఫిరాయింపుపై కరణం బలరామ్ కు తీరని అవమానం

Satyam NEWS

దళితబంధు యూనిట్ల గ్రౌండింగ్ లక్ష్యo

Murali Krishna

Leave a Comment