సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ పరిధిలోని మేళ్లచెరువు మండల కేంద్రంలో గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులను హరితహారం లక్ష్యాలను సాధించాలని మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలు పద్మావతి కోరారు.
అనంతరం మండల పరిషత్ అధికారి మాట్లాడుతూ ఈ సంవత్సరం అన్ని శాఖలకు హరితహారం లక్ష్యాలను కేటాయించారని, వాటిని సాధించాలని, నాటిన ప్రతి మొక్కను కాపాడాలని, ఆ బాధ్యత గ్రామ సర్పంచులు సిబ్బందిపై ఉందని అన్నారు. ప్రతి గ్రామంలో నర్సరీలు ఏర్పాటు చేశామని, 1,32000 మొక్కలు అందుబాటులో ఉన్నాయని అన్నారు.
ఈ కార్యక్రమంలో అదనపు కార్యదర్శులు, ఏపీవో రాజు, సాంకేతిక సహాయకులు, గ్రామ సర్పంచులు, కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.