నిర్మల్ జిల్లా బాసర లోని శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం నేడు పెద్ద ఎత్తున హరిత హారం కార్యక్రమం నిర్వహించింది. ఆరవ విడత హరితహారం కార్యక్రమం లో భాగంగా ఆలయానికి సంబంధించిన సర్వే నంబర్ 431 లో గల 8 ఎకరాల 22 గుంటల భూమిలో పెద్ద ఎత్తున మొక్కలు నాటారు.
ఆలయ EO వినోద్ రెడ్డి చొరవతో ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. మొత్తం 300 మొక్కలను నాటారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు, వేదపండితులు, ఆలయ సిబ్బంది, వాగ్దేవి లేబర్ సొసైటీ సిబ్బంది, HMDA సిబ్బంది పాల్గొని విజయవంతం చేశారు.