కొమురం భీం జిల్లా కాగజ్ నగర్ పట్టణంలోని కిమ్స్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ లో హార్మోన్ ఎన్ లైజర్ బయో కెమిస్ట్రీ ఎన్ లైజర్ మిషన్, సెల్ కౌంటర్ ను జిల్లా వైద్యాధికారి డాక్టర్ కొమురం బాలు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో డా.కృష్ణారావు, డా.రమాకాంత్, డా.చెన్న కేశవ రావు, డా.ముందడా, డా.ఆశిబుల్ హాక్ తదితరులు కూడా పాల్గొన్నారు.
ఈ సందర్భంగా డా.కొత్తపల్లి శ్రీనివాస్, డా.కొత్తపల్లి అనిత మాట్లాడుతూ సిర్పూర్ నియోజకవర్గంలోని పరిసర ప్రాంత ప్రజలు అధునాతన వైద్యం కోసం కరీంనగర్, హైదరాబాద్ లాంటి దూర ప్రాంతాలకు వెళ్లే అవసరం ఉండేదని తెలిపారు.
అయితే ఇప్పుడు మన కాగజ్ నగర్ పట్టణంలో కిమ్స్ మల్టి స్పెషాలిటీ హాస్పిటల్ లోనే అధునాతన వైద్య సౌకర్యాలను కల్పిస్తున్నామని ఆయన తెలిపారు.
పరిసర ప్రాంత ప్రజలకు ఇది మేలైన సేవలు అందిస్తుందని వారు తెలిపారు.
ఈ కార్యక్రమంలో డా.సత్యనారాయణ, ల్యాబ్ టెక్నీషియన్ లు పులా రఘు, కార్తీక్, కోట హరీష్, వేల్పుల కళ్యాణ్ కుమార్, కమిరె ప్రశాంత్, వినోద్, హాస్పిటల్ సిబ్బంది పాల్గొన్నారు.