ఏపీ కాంగ్రెస్ ప్రచార కమిటీ ఛైర్మన్ పదవిని మాజీ ఎంపీ హర్షకుమార్ తిరస్కరించారు. తాను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగానే కొనసాగుతానని వెల్లడించారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి ఈ – మెయిల్ ద్వారా తిరస్కరణ లేఖను పంపించారు. ప్రస్తుతం ఏపీలో అన్ని రాజకీయపార్టీల అధ్యక్షులు అగ్ర కులాల వారే ఉన్నారని తెలిపారు. వైసీపీ – రెడ్డి, టీడీపీ – కమ్మ, జనసేన – కాపు, బీజేపీ – కాపు, సీపీఎం- రెడ్డి, సీపీఐ – బి.సి, ఇప్పుడు కాంగ్రెస్ ఏపీ అధ్యక్ష పదవి బ్రాహ్మణ వర్గానికి ఇచ్చిందని లేఖలో పేర్కొన్నారు.
previous post