31.2 C
Hyderabad
February 11, 2025 21: 12 PM
Slider జాతీయం ముఖ్యంశాలు

కాలుష్యం నిండిన ఢిల్లీలో ఆరోగ్య ఎమర్జెన్సీ

delhi-pollution-1

దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్య స్థాయి నానాటికీ ప్రమాదకర స్థితికి చేరుతోంది. దీంతో కాలుష్య నియంత్రణ మండలి ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో ప్రజా ఆరోగ్య అత్యవసర స్థితి ప్రకటించింది. నవంబరు 5 వరకు నిర్మాణాలపై నిషేధం విధించింది. మరోవైపు కాలుష్యం దృష్ట్యా నవంబరు 5 వరకు స్కూళ్లకు సెలవు ప్రకటించారు. ​అధికారిక డేటా ప్రకారం ఢిల్లీ-ఎన్‌సీఆర్‌ ప్రాంతంలో శుక్రవారం మధ్యాహ్నం గాలి నాణ్యత సూచీ 582కు పడిపోయింది. సాధారణంగా గాలి నాణ్యత సూచీ 0-50 మధ్య ఉంటే ‘బాగుంది’ అని, 51-100 మధ్య ఉంటే ‘సంతృప్తికరం’ అని, 101-200 మధ్య ఉండే ‘మధ్యస్తం’, 201-300 అయితే ‘బాగోలేదు’, 301-400 అయితే ‘ఏమాత్రం బాగోలేదు’, 401-500 మధ్య అయితే ‘ప్రమాదకరం’, 500పైన ఉంటే ‘ప్రమాదకరం-ప్లస్‌ ఎమర్జెన్సీ’గా పరిగణిస్తారు.

Related posts

చెడు వ్యసనాలకు అలవాటుపడి జీవితం నాశనం చేసుకోవద్దు

Satyam NEWS

ప్రకృతి వనం స్మశాన వాటిక ప్రారంభించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

Satyam NEWS

మార్కాపురం ఎమెల్యే సీటు కోసం “ఉడుముల”

Satyam NEWS

Leave a Comment