ఈ నెల 10వ తేదీ తర్వాత ఏపీలో భారీ వర్షాలు కురిసే అవకాశాలు కనిపిస్తున్నాయి. వరుసగా మూడు తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని, వాటి ద్వారా ముప్పు పొంచి ఉండొచ్చు అంటున్నారు వాతావరణ శాఖ నిపుణులు. అరేబియాలో 1, బంగాళాఖాతంలో 2 తుపాన్లు ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ తుపానుల ప్రభావం కారణంగా కోస్తా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని అంచనా. బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోందని, ఈ ప్రభావంతో రాగల 3 రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడొచ్చని అప్రమత్తం చేసింది.
previous post