పశ్చిమగోదావరిజిల్లా ఏలూరు లో గురువారం ఉదయం జోరువాన కురిసింది. దీంతో ఉదయాన్నే మార్కెట్ లో నిత్యావసరాలు కొనుగోలు చేయలేక నగర ప్రజలు ఇబ్బందులు పడ్డారు. వర్షానికి తడవ కుండా షాపింగ్ మెట్ల పై కి చేరి తలదాచుకున్నారు. ఏలూరులో లాక్ డౌన్ వల్ల ఉదయం 6 గంటల నుండి 11 గంటల వరకు పాలు పళ్ళు కూరగాయలు పచారి సరకులు కొనుగోలు చేసుకునేందుకు జిల్లా అధికారులు సమయం కేటాయించారు.
ఎడతెరిపిలేని వర్షం కారణంగా కొనుగోళ్లు అమ్మకాలు స్తంభించి పోయాయి. 11 గంటల తరువాత పోలీసులు ప్రజల ఆరోగ్య రక్షణార్ధం నగరంలో వాహనాల తో పాటు ప్రజల రాకపోకలపై నిషేధాజ్ఞలు విధించి నగరంలో ప్రధాన మార్కెట్ రహదారులు దిగ్భందిస్తున్నారు.