ఏపీలో ఈ మధ్య ప్రమాదాలు జరుగుతున్నాయి. అదీ హెల్మెట్లు లేకుండా జరుగుతోందని అటు డాక్టర్లు ఇటు ట్రాఫిక్ పోలీసులు అంటున్నారు. దీంతో హెల్మెట్ వాడకంపై ప్రజలలో చైతన్యం, అవగాహన కల్పించేందుకు రాష్ట్రంలోని విజయనగరం జిల్లా ఎస్పీ ఆదేశాలతో నగర ట్రాఫిక్ డీఎస్పీ సూచనలతో ట్రాఫిక్ సిబ్బంది హెల్మెట్ అవగాహన చర్యలు చేపట్టారు.
నగరంలోని కోట జంక్షన్ వద్ద ఎస్ఐ భాస్కర రావు నేతృత్వంలో సిబ్బంది హెల్మెట్ పెట్టుకోని వాళ్లను తిరిగి ఇంటికి మళ్లించే చర్యలకు చేపట్టారు. ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ భాస్కర రావు మాట్లాడుతూ రోడ్డు ప్రమాదాలకు కారణం హెల్మెట్ పెట్టుకోకపోవడమేనని అన్నారు. ఈ నేపథ్యంలో ప్రతీ ఒక్కరూ హెల్మెట్ ధరించాలని ఎస్ఐ పేర్కొన్నారు.